1 July, 2026 | 11:16 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఉద్యమకారులకు చట్టబద్ధమైన కమిటీ వేయాలి

13-03-2026 12:00 AM

తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక

ముషీరాబాద్, మార్చి 12(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల అంశం లో ప్రభుత్వం వెంటనే చట్టబద్దమైన కమిటీ వేయాలని తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేసింది. ఈ కమిటీకి ఆరు నెలల కాల పరిమితి మాత్రమే ఉండాలని కోరింది. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వేదిక అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి, నాయకులు జానకి రెడ్డి, ఓరుగంటి ఆనంద్, సుల్తాన్ యాదగిరి, సికింద్ర బేగం, అనిల్ కుమార్, కొమురయ్య, తదితరులు మాట్లాడారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వేయాలన్నారు.

అలాగే 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యమ కారుల త్యాగం మరువలేనిదని, ఎన్నో కష్టాలు, కేసులు, జైలు జీవి తం అనుభవించిన వారు నేడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముం దుండాలని అన్నారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలను కూడా ఆదుకోవడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మోహన్ బైరాగి, లారా, గోశిక రవి, యాదగిరి, హరి, సుచరిత, సుజి తదితరులు పాల్గొన్నారు.