14 July, 2026 | 7:13 PM

Breaking News

ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •  

జర్నలిస్టులపై ఓ నేత అసభ్యకర సోషల్ పోస్టులు

25-11-2025 05:17 PM

తూప్రాన్ (విజయక్రాంతి): చేసే అక్రమాలు అధికారుల దృష్టికి తీసుకెళ్తే జర్నలిస్టుల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి మాట్లాడిన బెదిరింపు వీడియోలు సెండ్ చేస్తూ మీడియా రంగాన్ని అవమానపరుస్తున్న తూప్రాన్ మున్సిపల్ మాజీ నాయకుడుపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకెళితే తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అవుసులోని కుంట కబ్జాకు గురయ్యింది.

ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు సోమవారం ఘటనా స్థలానికి చేరుకొని కబ్జా నిజమని, కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వార్త ప్రచురించగా దొంగ జర్నలిస్టులు అంటూ ఒక నేత బుజాలు ఎగరేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ అధికారి సంబంధం లేని ఓ నాయకుడితో ఫోన్ లో విలేకరులతో చర్చలు జరపడం చూస్తే అటు అధికారులకు, నాయకులకు ఎంత గొప్ప సంబంధాలు ఉన్నాయో తెలుస్తుంది. ఏది ఏమైనా జర్నలిస్టుల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్న నాయకుడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.