8 April, 2026 | 3:39 PM

Breaking News

అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •   రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి   •   టచ్ రగ్బీ నేషనల్ మీట్లో పాల్గొననున్న కస్తూర్బా విద్యార్థి   •   కాంగ్రెస్ పార్టీ 52 వ డివిజన్ కార్యాలయం ప్రారంభం.   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   నిజాంసాగర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •   గిరిజన గురుకుల పాఠశాలకు గ్రీన్కో ఫౌండేషన్ కంప్యూటర్ల అందజేత   •   కమిషనర్ గా శ్రీహరి రాజు   •  

సాగర్ కాలువలో పడిన గోమాత

08-04-2026 12:00 AM

కాపాడిన రానా

కల్లూరు, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): మానవత్వం ఇంకా సజీవంగా ఉందనే నిదర్శనంగా నిలిచే ఘటన మండల పరిధిలోని రఘునాథ బంజర గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. సాగర్ కాలవలో ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న గోమాతను ప్రాణాలకు తెగించి కాపాడిన రఘునాథ గూడెం సర్పంచ్ భర్త రానా ధైర్యసాహసం స్థానికులను కట్టిపడేసింది.

వివరాల్లోకి వెళితే& కాలవలో చిక్కుకుని బయటపడలేక అలమటిస్తున్న గోమాతను గమనించిన రఘునాథ గూడెం గ్రామ సర్పంచ్ కుక్కా సుధారాణి భర్త రానా క్షణం ఆలస్యం చేయకుండా స్పందించాడు.పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన ఆయన వెంటనే కాలవలోకి దూకి గోమాతను రక్షించే ప్రయత్నం ప్రారంభించాడు. అయితే భయంతో వణికిపోయిన గోవు దగ్గరకు రానీయకపోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలవలో ఈదుకుంటూ వెంబడించాల్సి వచ్చింది.

ఇరువైపులా సైడ్ వాల్స్ ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారినా,తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రానా పోరాటం కొనసాగించాడు .చివరికి కొంత వెసులుబాటు ఉన్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత స్థానికుల సహకారంతో తాళ్లను ఉపయోగించి గోమాతను సురక్షితంగా ఒడ్డుకు లాగారు.ఈ క్రమంలో గోవు భయంతో వెనుక కాళ్లతో తన్నినా,రానా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన ధైర్యాన్ని చాటుకున్నాడు.ప్రాణాపాయంలో ఉన్న మూగజీవాన్ని కాపాడిన రానా ధైర్యసాహసం గ్రామంలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది.గ్రామ అభ్యున్నతికి కృషి చేయడమే కాకుండా,కరుణా హృదయంతో గోమాత ప్రాణాలు రక్షించిన ఆయనను స్థానికులు, ప్రయాణికులు ఘనంగా అభినందించారు.ఈ రక్షణ కార్యక్రమంలో గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.