రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Grain Procurement Center) రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) బుధవారం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర అందించడంతో పాటు, మధ్యవర్తుల సమస్యలు లేకుండా నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు సులభంగా, పారదర్శకంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.




