2 July, 2026 | 10:40 PM

Districts - Kumarambheem Asifabad

article_57834992.webp
ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి

ఆసిఫాబాద్(విజయ క్రాంతి):జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యుల విధుల నిర్లక్ష్యం, నకిలీ హాజరు నమోదు, పర్యవేక్షణ లోపాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విధులకు హాజరు కాకుండానే హాజరు నమోదు చేసిన వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోయిరే ప్రకాష్, పిడుగు శంకర్, కొదురుపాక మహేష్, వర్కోల్ రాకేష్, పిప్పిరి వెంకటేష్, శ్రీరామ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

02-07-2026

article_55596315.webp
జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లాలోని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ భవన సముదాయంలోని తన ఛాంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణీలకు, చిన్నారులకు, రోగులకు అవసరమైన చికిత్స, మందులు, పరీక్షలు సమయానికి అందేలా చూడాలని ఆదేశించారు.ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు, మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోగులను అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉండాలని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ, వైద్య విద్యా బోధన, మెరుగైన వసతుల కల్పనపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

02-07-2026

article_90025347.webp
విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత

విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం జిల్లాలోని కెరమెరి మండలం అగర్వాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ రోజా సోనాజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలిపారు.

01-07-2026