మార్లవాయిలో గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ నూతన సభ్యుల సన్మానం
జై నూర్,మే18 (విజయ క్రాంతి) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ సభ్యులను సోమవారం ఘనంగా సన్మానించారు. సన్మానితులైన వారిలో సార్ మేడి గేడం గణపత్ రావు, గీతాదర్ ఆత్రం భగవంత్ రావు, రాయి సెంటర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆడ సోనేరావు ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనక ప్రతిభ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ వ్యవస్థ పటిష్టతకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజం విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ముందుకు సాగేందుకు రాయి సెంటర్ కీలక పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు.
18-05-2026