20-02-2026 01:20:18 AM
కాగజ్నగర్/బెజ్జూర్ ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమానికి కృషి చేయడం జరు గుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కాగజ్నగర్ మండలంలోని ఈజ్గాం గ్రామంలో రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి మహిళా సమాఖ్య సభ్యులకు అందజేయాలని ఎంపీడీవో ఉజ్వల్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ మణిరాజ్లను ఆదేశించారు.
అలాగే బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆరె కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, బారెగూడ సర్పంచ్ తేలి బాపు, ఏఎంసీ చైర్మన్ సిద్ధల దేవయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, సర్పంచ్ అగ్గిల్ల సంగీతశ్రీనివాస్, ఉపసర్పంచ్ లోకండె నరేందర్, నజుల్నగర్ సర్పంచ్ బికాస్ ఘరామి, తదితరులు పాల్గొన్నారు.