5 May, 2026 | 6:32 PM

Breaking News

ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •   ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలి: కలెక్టర్ హరిత   •   పండుగలు వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి   •   రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి   •   కొత్తరకం పంటలపై రైతాంగానికి అవగాహన కల్పిస్తాం   •   కొమ్ముగుడెంలో సిసి రోడ్లు ప్రారంభించిన సోయం వీరభద్రం   •   జనాభాగణాలపై ముగిసిన శిక్షణ   •  

ప్రజా సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే హరీష్ బాబు

20-02-2026 01:20 AM

కాగజ్‌నగర్/బెజ్జూర్ ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమానికి కృషి చేయడం జరు గుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కాగజ్నగర్ మండలంలోని ఈజ్గాం గ్రామంలో రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి మహిళా సమాఖ్య సభ్యులకు అందజేయాలని ఎంపీడీవో ఉజ్వల్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ మణిరాజ్లను ఆదేశించారు.

అలాగే బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆరె కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, బారెగూడ సర్పంచ్ తేలి బాపు, ఏఎంసీ చైర్మన్ సిద్ధల దేవయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, సర్పంచ్ అగ్గిల్ల సంగీతశ్రీనివాస్, ఉపసర్పంచ్ లోకండె నరేందర్, నజుల్నగర్ సర్పంచ్ బికాస్ ఘరామి, తదితరులు పాల్గొన్నారు.