మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి
17-07-2026 02:09 PM
నిర్మల్ జులై 17 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ పోచమ్మ ఆలయంలో మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం సందర్శించి బోనాల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం బోనాల్లో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ సి చైర్మన్ ధర్మాజీ రాజేందర్ మండల పార్టీ అధ్యక్షులు పోలాస మల్లేష్ తదితరులు ఉన్నారు.






