18 July, 2026 | 12:39 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

పార్టీలు రిజర్వేషన్ నిర్ణయిస్తే ఎలా?

17-11-2025 12:00 AM

చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ చేయాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 

జడ్చర్ల, నవంబర్ 16: పార్టీలో రిజర్వేషన్ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తే ఎలా సరిపోతుందని చట్ట ప్రకారం 42% రిజర్వేషన్ చేసి ఎన్నికలు నిర్వహించాలని మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జెఏసి,బీసీ జాగృతి సేన, బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్ట బద్ధతతో కూడిన 42% రిజర్వేషన్ల సాధనకై సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మద్దతు తెలియజేస్తూబీసీ రిజర్వేషన్ల సాధనకు సంతకం చేశారు.

రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలపై పై ఒత్తిడి తీసుకువచ్చే 42 శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సగర సంగం జిల్లా అధ్యక్షులు ప్రనిల్ చందర్, తదితరులు ఉన్నారు.