21 April, 2026 | 5:37 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

21-04-2026 04:07 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల మాగీ గ్రామంలోని శివపంచాయతన అభయాంజనేయ క్షేత్ర చతుర్థ (4వ) వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నాడు  పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, పరివార దేవతల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవం ఆలయ ధర్మకర్త మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో, గ్రామస్తుల సహకారంతో కన్నుల పండుగగా జరిగింది. 

కార్యక్రమాన్ని గ్రామ పురోహితులు మధుకర్ రావ్ పంతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  మార్కెట్ కమిటీ చైర్మెన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, నాయకులు ప్రజా పండరి, మంద బలరాం, వెంకట్రాం రెడ్డి, జనార్ధన్ రెడ్డి, అశోక్ రెడ్డి మాగి గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.