27 March, 2026 | 2:49 AM

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతాం

08-10-2025 07:08 PM

బైంసా: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులను, ప్రజలను మోసం చేసిన తీరుపై ప్రజల్లో ఎండగడతామని మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ అన్నారు. బుధవారం కుంటల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డులను పంపిణీ చేశారు. పెన్షన్లు పెరగలేదని రుణమాఫీ కాలేదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం లేదని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దత్తు నాయకులు పాల్గొన్నారు.