15 May, 2026 | 11:39 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

రోడ్డు భద్రత నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి

16-01-2026 06:13 PM

రోడ్డు భద్రత నిబంధన లు పాటించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ మన్మోహన్ 

కామారెడ్డి,(విజయక్రాంతి): రోడ్డు భద్రత నిబంధనలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మన్మోహన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశం హాలులో కామారెడ్డి రూరల్ సీఐ రామన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ మన్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని వాహన దారులకు సూచించారు. పోలీస్ పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, టీజీవో అధ్యక్షులు, జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్, పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.