కూచిపూడి తండాలో ఘనంగా వన భోజనాలు
30-08-2026 07:09 PM
కోదాడ ఆగస్టు 30(విజయ క్రాంతి): శ్రావణ మాసం సందర్భంగా కూచిపూడి తండా గ్రామంలో ఆదివారం వన భోజనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అందరూ కలిసి వన భోజనాలు చేశారు. అనంతరం చిన్నారులు, యువతీ యువకులకు ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా సాగింది.






