22 May, 2026 | 11:35 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఢిల్లీ నుంచి గల్లీకి నిధులు తెస్తా

07-02-2026 12:39 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ 21 డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి  

కరీంనగర్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం రావడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాకుండా చొప్పదండికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఘోర ఓటమి తథ్యమని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు లోపాయికారీ ఒప్పదం చేసుకుందన్నారు.

కరీంనగర్ కార్పొరేషన్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చి నేను అభివృద్ధి చేస్తే... మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆ నిధులు తామే తెచ్చానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ‘గంగులా నేనడుగుతున్నా... నువ్వెవరో మోదీకి తెలుసా? నీ ముఖం ఎన్నడైనా చూసిండా? బీఆర్‌ఎస్ అడిగితే నిధులిస్తారా? బీజేపీ అడిగితే నిధులిస్తారా? అసలు అవన్నీ కేంద్ర నిధులా కాదా?”అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 21వ డివిజన్ లో అభ్యర్థి డి కొండపల్లి సతీష్ నుభారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంక్ సమీపంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.