24 April, 2026 | 5:01 PM

Breaking News

విద్యుత్ ఘాతంతో మేక మృతి   •   నేడు 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్   •   వ్యవసాయ కార్మిక ఆధ్వర్యంలో ఉపాధి హామీ సమస్యలపై పీడీకి వినతి   •   గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు అంగన్వాడిల ద్వారా సేవలు అందించాలి   •   మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ   •   దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి   •   పేదల పెన్నిధి - సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి   •   ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీడీవో   •   పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ   •   సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే   •  

'అంగ, బంగా, కళింగ'లో బీజేపీ ప్రభుత్వాలు.. TMCకి ఓటమి తప్పదు

24-04-2026 03:22 PM

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో మార్పు కోరుతూ ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఓటు వేశారని ఉద్ఘాటిస్తూ, ప్రస్తుత తూర్పు భారతదేశాన్ని పాలించిన ప్రాచీన రాజ్యాలైన 'అంగ, బంగ, కళింగ' ప్రాంతాలలో వచ్చే నెల నాటికి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) శుక్రవారం పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో షా మాట్లాడుతూ, గురువారం తొలి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో 110కి పైగా స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.

"బెంగాల్ ప్రజలు మొదటి దశలో అన్ని రికార్డులను బద్దలు కొట్టి, మార్పు కోసం ఉత్సాహంతో ఓటు వేశారు," అని 92 శాతానికి పైగా నమోదైన పోలింగ్ శాతాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్ భైపో ట్యాక్స్, సిండికేట్ రాజ్ ను అంతమొందిస్తామని అమిత్ షా తేల్చిచెప్పారు. పశ్చిమ బెంగాల్ లో ఈ సారి బీజేపీ అధికారం చేపట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. టీఎంసీకి ఈ సారి ఓటమి తప్పదన్నారు. ఓటింగ్ శాతం,.. మొత్తం దేశంలో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేవారి ఉత్సాహాన్ని పెంచుతోందన్నారు.

తొలి విడతలో ఓటు వేసిన బెంగాల్ ఓటర్లకు అమిత్ షా అభినందనలు తెలిపారు. భయం నుంచి భరోసా దిశగా చేపట్టిన యాత్రను చాలా మంచిగా మొదలు పెట్టారని తెలిపారు. రెండో విడతలో కూడా ఓటర్లు భయం నుంచి భరోసా దిశగా మొదలైన యాత్రను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈసీ, సీఏపీఎఫ్, ఈసీ యంత్రాంగం, బెంగాల్ పోలీసులను కూడా అమిత్ షా అభినందించారు. బెంగాల్ లో చాలా ఏళ్ల తర్వాత ఒక్క మరణం కూడా లేకుండా ఎన్నికలు జరిగాయన్న అమిత్ ఈ ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని సూచించారు.