1 July, 2026 | 11:13 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పద్మాజీవాడి సింగిల్ విండోలో ఇష్ట రాజ్యం

15-04-2026 04:21 PM

పదవి లేకున్నా పెద్దరికం....వారి కనుసైగాల్లోనే పనులు 

సదాశివనగర్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడిలోనీ సింగిల్ విండోలో సిబ్బంది వ్యవహారిస్తున్న తిరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలక వర్గం పదవి కాలం పూర్తి అయి 6నెలలు గడుస్తున్న వారి కనుసైగాల్లోనే పనులు కొనసాగుతున్నాయి. వారు చెప్పినట్టు సిబ్బంది వ్యవహరించడం గమనర్వాహం.సింగిల్ విండో సర్వ సభ్య సమావేశంలో సైతం పాలక వర్గాన్ని పిలిచి స్టేజి పై కూర్చోబెట్టారు. అది కాకుండా శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభం లో కూడ పాల్గొన్నారు. అధికాకుండా బుధవారం బీమా చెక్కు పంపిణి సమయంలో కూడా గత పాలక వర్గాన్ని పిలిచి వారిచే చెక్కులు అందజేశారు. దీనిపై స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ కు కనీసం సమాచారం ఇవ్వకపోవడం పై సర్వత్రా విమర్శలు వెలుబడుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా సింగిల్ విండో సిబ్బంది వ్యవహరించిన తిరును సోసైటీ పరిధిలోనీ రైతులు విమర్శిస్తున్నారు.