తాంసి(కే)శివారులో పులి పిల్ల సంచారం
11-08-2026 09:59 AM
తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి(కే) శివారులోని ఓ పంట చేనులో సోమ వారం సాయంత్రం పులి పిల్ల కనిపించింది, అటుగా వెళ్తున్న ప్రయాణికులు దాన్ని సేల్ ఫోన్ లో చిత్రీకరించి చేను యజమానికి సమాచారం అందించారు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ మాసాలలో కానీ పించే పులులు, ఈ సారి తొందరగానే రావడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటనపై అధికారులు ధృవీకరించాల్సి ఉంది.






