12 July, 2026 | 5:39 PM

Breaking News

పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •  

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి

02-05-2026 12:27 AM

అలంపూర్ మే 1: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు రైతులు మృతి చెందారు.అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కోలుకోలేక మరో వ్యక్తి శుక్రవారం మృతి చెందారు.దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మృతి చెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ హృదయ విదారక ఘటన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొయిలదిన్నే గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చంద్ర మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి (51) తిక్కారెడ్డి ( 47) రైతులైన ముగ్గురు అన్నదమ్ములు పశు గ్రాసం కోసం గత నెల 28న మంగళవారం తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన మరో నలుగురితో కలిసి కొత్తకోటకు ట్రాక్టర్ లో వెళ్లారు.

ట్రాక్టర్ లో పశుగ్రాసాన్ని వేసుకుని గ్రామానికి బయలు దేరారు.ఎర్రవల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను వెనకనుంచి డీసీఎం ఢీకొట్టడంతో ట్రాక్టర్ అదుపు తప్పి జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లింది.వరిగడ్డి లోడ్ పై కూర్చున్న వారు జాతీయ రహదారిపై చెల్లాచెదరుగా పడిపోయారు.

ఈ ప్రమాదంలో అన్నదమ్ములు కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి, చంద్రమోహన్ రెడ్డిల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా అదేరోజు కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి మార్గమధ్యలో మృతి చెందారు. విషమంగా ఉన్న చంద్రమోహన్ రెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్మలు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.