22 May, 2026 | 10:48 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

రాజీపడే ప్రసక్తే లేదు

08-08-2025 12:00 AM
  1. రైతుల కోసం ఏమైనా చేసేందుకు భారత్ సిద్ధం
  2. ట్రంప్ టారిఫ్‌లపై పరోక్షంగా స్పందించిన ప్రధాని మోదీ
  3. భారత్‌పై ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అమెరికా అధ్యక్షుడు భారత్‌పై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. ఈ సుంకాల పెంపుపై భారత ప్రధాని నరేంద్రమోదీ గురువారం పరోక్షంగా స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భారతీయ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టమని అమెరికాకు గట్టిగా బదులిచ్చారు. భారత్ రష్యా నుంచి ముడిచమురు, ఆయుధాలు దిగుమతి చేసుకుంటోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ సుంకాలు విధించారు.

వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్ స్వామినాథన్ జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన ‘ఎం.ఎస్ స్వామినాథన్ సెంటినరీ అంతర్జాతీయ సదస్సు’లో ప్రసంగించారు. ఈ సదస్సులో అమెరికా సుంకాలపై మోదీ స్పందించారు. ‘రైతుల సంక్షేమమే మాకు ముఖ్యం. రైతులు, మత్య్సకారులు, పాడి రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడదు. ఈ నిర్ణయం వల్ల వ్యక్తిగతంగా ఎంతో చెల్లించాలని నాకు తెలుసు.

రైతుల కోసం ఎంతైనా చెల్లించేందుకు సిద్ధమే. భారత్ కూడా అందుకు సిద్ధంగా ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విషయంలో ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్న ప్రధాని రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. భారత్ తమకు మిత్రదేశం అని చెబుతూనే ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. ఈ ప్రతీకార సుంకాలపై విదేశాంగ శాఖ కూడా ఘాటుగా స్పందించింది. తాజాగా విధించిన 50 శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.