8 August, 2026 | 5:32 PM

Breaking News

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •   ఫారం పండు పనులతో భూగర్భ జలాలు పెంపు.   •   నో పార్కింగ్‌ బోర్డులు.. అయినా అదే తీరు!   •   క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కార్మిక కోడుల రద్దు వరకు ఉద్యమిద్దాం   •  

చిరు వ్యాపారి దుకాణంలో చోరీ

08-08-2026 04:17 PM

కొండపాక,ఆగష్టు 8:( విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కొండపాక ఎక్స్ రోడ్డు వద్ద, బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ చిన్న వ్యాపారి దుకాణం లో చోరీ జరిగింది. టీ, సిగరెట్లు, బిస్కెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వడ్ల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.

శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, రోజూలాగే ఉదయం దుకాణం తెరిచేందుకు రాగా, షాపు తాళం గడ్డపారతో పగులగొట్టి ఉండడాన్ని గుర్తించాడు. దుకాణంలో పరిశీలించగా ఒక గ్యాస్ సిలిండర్, 20 సిగరెట్ డబ్బాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. అలాగే, గల్లా పెట్టెలో ఉన్న రూ  4000 నగదు కూడా అపహరణకు గురైందన్నారు. ఈ ఘటనపై బాధితుడు వెంటనే కుకునూరుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుకాణాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.