9 May, 2026 | 11:24 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

తెలంగాణ అభివృద్ధిపై దూరదృష్టి భేష్

17-12-2025 01:02 AM

సీఎం రేవంత్‌రెడ్డికి సోనియాగాంధీ అభినందన

2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచన

 హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని తీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కలిసి.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను అందజేశారు.

డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రో జుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 వివరాలను సోనియాగాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. దీంతో పాటు రెండేళ్లుగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను సైతం వివరించారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరించగా ఇదే విధంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని సూచించారు.