9 May, 2026 | 10:42 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

ఈడీ చార్జిషీట్ నిరాకరణ

17-12-2025 01:05 AM
  1. మలుపు తిరిగిన నేషనల్ హెరాల్డ్ కేసు
  2. సోనియా, రాహుల్‌కు భారీ ఊరట
  3. ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోలేమన్న ఢిల్లీ హైకోర్టు

 హైదరాబాద్, డిసెంబర్ 16 : ‘ నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.. కేవలం బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చి న ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈడీ  దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేం’ అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో నిందితులుగా అభియోగం మోపబడిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం ధీకి భారీ ఊరట లభించింది.

అయితే, మేజిస్ట్రేట్ ఇచ్చిన సమన్ల ఆదేశాల మేరకు కాకుండా, ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం నమో దు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే కేసు విచారణ జరగాలని స్పష్టం చేయడంతో మలుపు తిరిగింది. మంగళవారం జరిగిన నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ఈడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

దర్యాప్తును నిలిపివేయలేదని స్పష్టం చేసింది. అదే సమయంలో, ఈ దశలో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న సోనియా, రా హుల్ గాంధీలకు ఎఫ్‌ఐఆర్ కాపీని పొందే అర్హత లేదని కూడా కోర్టు పేర్కొంది. తాజా పరిణామంతో గాంధీ కుటుంబానికి ఈ కేసులో ఉపశమనం లభించింది.