14 July, 2026 | 3:16 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది..

04-11-2025 06:05 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన అసరి మల్లయ్య ఆపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన వాళ్ళ కొడుకు వెంటనే 108కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ 108 సిబ్బంది తక్షణమే స్పందించి ఆపస్మారక స్థితిలో ఉన్న మల్లయ్యకు షుగర్ లెవల్స్ పడిపోవడం గమనించిన టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ తక్షణమే డిక్ట్రోజ్ సెలైన్ బాటిల్ ఎక్కించి తగు ప్రథమ చికిత్స చేసి మల్లయ్య ప్రాణాలు కాపాడి కరీంనగర్ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించడం జరిగింది. తక్షణమే ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ, పైలట్ తోటపల్లి రాజేందర్ కు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.