రెండుసార్లు మరణించిన వ్యక్తి!
30-04-2026 02:44 AM
- వేర్వేరు తేదీల్లో రెండు డెత్ సర్టిఫికెట్లు
- జారీ చేసిన అధికారులు
- తప్పుడు పత్రాల జారీపై సర్వత్రా విమర్శలు
చందుర్తి, ఏప్రిల్ 29(విజయక్రాంతి): మరణించిన ఒక వ్యక్తికి సంబంధిత అధికారులు వేర్వేరు తేదీల్లో రెండుసార్లు డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి లింగయ్య అనే వ్యక్తికి 2022 మే 5న డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే అదే వ్యక్తి పేరుపై వైద్య ఆరోగ్య శాఖ మరోసారి 5 జూన్ 2024న మరో డెత్ సర్టిఫికెట్ జనవరి 1, 2024న మరణించినట్లు మరోసారి జారీ చేశారు. ఒకే వ్యక్తి రెండుసార్లు మరణించినట్లు తప్పుడు పత్రాలను జారీ చేయడమేమిటని అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు పత్రాలపై అధికారులు తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నారు.






