19 March, 2026 | 1:08 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

19-03-2026 12:50 AM

కాజీపేట, మార్చి 18 (విజయక్రాంతి): సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా విద్యాబోధనలో సేవలందిస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి సిహెచ్ లింగారావు డిమాండ్ చేశారు. ఎస్ ఎస్ ఏ విద్యా విభాగంలో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగులు సిబ్బంది

తమ దీర్ఘకాలంగా అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం కాజీపేట మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివో కనకయ్య, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సుమలత, సి ఆర్ పి లు రాంప్రసాద్, రేణుక, అయ్యార్పి యశోద పాల్గొన్నారు.