18 May, 2026 | 12:29 PM

యువత ఆరోగ్యమే సమాజ బలం

18-05-2026 11:22 AM

- కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఫిట్ అండ్ యాక్టివ్ 2కె రన్, యోగా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) పాల్గొన్నారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే సమాజం బలంగా నిలుస్తుందని అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి బస్ స్టాండ్ ముందు వరకు నిర్వహించిన 2కే రన్‌లో యువత, అధికారులు పాల్గొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ ఇంచార్జి అధికారి సీతారాం నాయక్, ఇంచార్జి వైద్యాధికారి రవి నాయక్, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర తదితరులు పాల్గొన్నారు.