3 July, 2026 | 10:25 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

పంట నష్టపోయిన కౌలు రైతు చడపంగు వెంకటేశ్వర్లు ఆవేదన

30-10-2025 11:08 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని యర్రవరం గ్రామానికి చెందిన కౌలు రైతు చడపంగు వెంకటేశ్వర్లు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. తుఫాను కారణంగా పంట నష్టపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గురువారం ఆయన మాట్లాడుతూ కౌలుకు తీసుకొని సాగు చేసిన వరి తుఫానుతో నష్టపోయినట్లు తెలిపాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు. ప్రభుత్వం, అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. నష్టపోయిన పొలాన్ని చూపుతూ కన్నీరు మున్నీరయ్యాడు.