3 July, 2026 | 11:10 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర.. అసెంబ్లీలో గళమెత్తుతాం: హరీశ్ రావు

12-03-2026 04:41 PM

ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తుతాం

హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (TGSRTC Joint Action Committee) నాయకులు మాజీ మంత్రి హరీశ్ రావును(Former Minister Harish Rao) కలిసి, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పక్షాన అంసెబ్లీలో గళమెత్తుతామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని అప్పుల కుప్ప చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరించే కుట్రలు చేస్తోందన్నారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని హరీశ్ రావు పేర్కొన్నారు.