14 July, 2026 | 3:24 PM

Breaking News

ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •  

పాఠశాలకు ఉపాధ్యాయుడి చేయూత

06-01-2026 08:20 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): తాను పనిచేసే పాఠశాలకు చేయూతనందించేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని మండల విద్యాధికారి చత్రునాయక్ అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బోళ్ల గోవిందరెడ్డి అనే ఉపాధ్యాయుడు రూ.5 వేల ఆర్థిక సహాయంతో ఐదు చెత్త బుట్టలు, మూడు డ్రమ్ములు మంగళవారం పాఠశాలకు అందించారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి పాల్గొని మాట్లాడుతూ... పాఠశాలకు అవసరమైన చిన్నచిన్న పనులకు ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థిక సహాయాన్ని అందించి ఇతరులకు ఆదర్శంగా నిలవడం హర్ష నియమన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయుడు బోళ్ల గోవిందరెడ్డిని ఆయన అభినందించారు.