15 May, 2026 | 10:19 PM

Breaking News

పిల్లలు పుట్టలేదని మనస్తాపంతో టీచర్ ఆత్మహత్య

30-08-2025 01:39 PM

హైదరాబాద్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District) కాగజ్‌నగర్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం గర్భం దాల్చలేకపోవడంతో బాధపడుతూ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుని మరణించింది. కౌటాల మండలంలోని ఒక పాఠశాలలో పనిచేస్తున్న మిడిదొడ్డి కవిత (40) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యెల్లాగౌడ్ తోటలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పిల్లలు లేకపోవడంతో ఆమె చాలా కాలంగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. ఆమె భర్త ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాడు. కాగజ్ నగర్ కు చెందిన కవిత జిల్లాలోని వివిధ ప్రాంతాలలో సేవలందించారు. బోధన పట్ల ఆమెకున్న నిబద్ధతకు పేరుగాంచారు. ఆమె కవయిత్రి, నర్తకి కూడా. ఆమె మరణం పట్ల సహోద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.