25 February, 2026 | 8:05 PM

'బాలలందరికీ న్యాయం' పోస్టర్ ఆవిష్కరణ

25-02-2026 06:19 PM

చేగుంట,(విజయక్రాంతి): ​చేగుంట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో విజన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన బాలలందరికీ న్యాయం, అవగాహన పోస్టర్‌ను ఎమ్మార్వో శివప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మహిళాలో, శిశు సంక్షేమ శాఖ సహకారంతో బాల్య వివాహాల నిరోధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ మనందరి బాధ్యత అని, బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో విజన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.