2 July, 2026 | 10:51 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సుప్రియ శ్రీనివాస్‌గౌడ్

06-02-2026 12:49 AM

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు (ఎల్లంపేట్) లో బిజెపి అభ్యర్థి గౌరయ్య గారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతున్నారు.

సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రచారానికి అనూహ్యస్పందన లభిస్తోంది. వార్డు పరిధిలో యువకులు, మహిళలు, కుల సంఘాల మద్దతు కూడగట్టారు. సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్గొనడం కలిసి వస్తోంది. శ్రీనివాస్ గౌడ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్ మేనల్లుడు. శ్రీనివాస్ గౌడ్ భార్య సుప్రియ కౌన్సిలర్ పదవికి పోటీ చేస్తున్నారు. 

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: సుప్రియ శ్రీనివాస్ గౌడ్ 

ఎల్లంపేటలోని పదవ వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే అభివృద్ధికి శా యశక్తుల కృషి చేస్తానని సుప్రియ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మున్సిపాలిటీ నిధులతో రోడ్లు, నువ్వు కాలువలు నిర్మిస్తానన్నారు. మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.