21 July, 2026 | 7:15 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

చలిమెడను సత్కరించిన సునీల్ రావు

21-07-2026 02:44 PM

ముకరంపుర,(విజయక్రాంతి): అమెరికాకు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ నుండి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ అందుకున్న కరీంనగర్ డైరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వరరావును సప్తగిరి కాలనీలోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కలిసి శాలువతో సత్కరించారు. గత 40 సంవత్సరాలుగా కరీంనగర్ డైరీని విజయపథంలో నడిపిస్తూ, పాడి పరిశ్రమలో ఆయన చేసిన కృషికి, విశేష సేవలకు గుర్తింపుగానే మేరీల్యాండ్ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయడం జరిగిందని సునీల్ రావు కొనియాడారు. ఇదే  ఉత్సాహంతో రాబోయే రోజుల్లో కరీంనగర్ డైరీ పేరును దేశవ్యాప్తంగా మారుమ్రోగేలా మరింతగా కృషి చేయాలని, పాడి పరిశ్రమ అభివృద్ధికి మరిన్ని నూతన కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ, డాక్టరేట్ పొందిన శుభ సందర్భంగా రాజేశ్వరరావు కు సునీల్ రావు తన హృదయపూర్వక  శుభాకాంక్షలు తెలియజేశారు.