26 May, 2026 | 6:22 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు

30-12-2025 01:42 AM

మేడ్చల్, డిసెంబర్ 29(విజయ క్రాంతి): జిల్లాకు అవసరమైన యూరియా ఎరువులు  ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్  మను చౌదరి  తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఈ రోజు వరకు 773 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగు నీటి సౌకర్యం కల్పించాలని  సంబంధిత అధికారులకు సూచించారు.

ఉదయం 6.00 గంటల నుండి కౌంటర్ వద్ద యూరియా సేల్స్ ప్రారంభించాలని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న యూరియా నిల్వలు సాగుకు  సరిపోతాయని, అవసరాన్ని బట్టి మరిన్ని సరఫరాలు కూడా క్రమం తప్పకుండా అందుతున్నాయని కలెక్టర్ రైతులకు భరోసానిచ్చారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.