16 March, 2026 | 3:11 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

విజయవంతమైన వైద్య శిబిరం

16-03-2026 01:09 AM

120 మందికి వైద్య సేవలు అందించిన సిబ్బంది

రాజేంద్రనగర్ మార్చి 15 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ పద్మశ్రీ హిల్స్ కాలనీ లో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతమైంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు పద్మశ్రీ హిల్స్ పార్కులో రైనా తెర్కోర్ డయాగ్నస్టిక్ క్లినిక్ మరియు పద్మ శ్రీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్త్ క్యాంపు నిర్వహించారు.

దాదాపు 120 మంది పాల్గొని ఈ వైద్య శిబిరం లో చికిత్సలు చేయించుకున్నారు. బ్లడ్‌టెస్ట్‌లను మరియు థైరాయిడ్ పరీక్షలను చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరం లో రెనా క్లినిక్ డాక్టర్ ఏం. ర్ ఎలిజబెత్, అభిషిక్త్. కె మరియు పద్మశ్రీ హిల్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు అమరేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మరియు థైరోకేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.