6 March, 2026 | 11:34 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణను విజయవంతం చేయాలి

06-03-2026 03:00 PM

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

బాన్సువాడ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మున్సిపల్ ఛైర్పర్సన్ విజయ కాసులవార్, వైస్ ఛైర్పర్సన్ రేష్మా బేగం, కౌన్సిలర్లు, ప్రజా ప్రజా ప్రతినిధులు మెప్మ అర్పిలతో కలిసి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుదల, ప్లాస్టిక్ నిషేధం అమలు, చెత్త వర్గీకరణ, డ్రైనేజీ శుభ్రత, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు 06-03-2026 నుండి 12-06-2026 వరకు కొనసాగనుందని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని, మున్సిపాలిటీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి రాజు,మున్సిపల్ పాలకవర్గం సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.