26 April, 2026 | 8:49 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

విద్యార్థులు బాగా చదవాలి

20-02-2026 12:00 AM
  1. ఉత్తమ విద్యార్థులకు నగదు బహుమతి అందిస్తాం 
  2. విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి

జగదేవపూర్, ఫిబ్రవరి 19: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళా శాలలో వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగదేవ్పూర్ కు చెందిన విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి హాజరయ్యారు. 

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తా ను కళాశాలలో 1983 -85 సంవత్సరంలో విద్యను అభ్యసించినట్లు తెలిపారు. విద్యార్థులు ఏ మార్గంలో విద్యను అభ్యసించాలి అలాగే మొబైల్ అవసరం కొద్దీ వాడాలని, అలాగే దుర్వినియోగం చేస్తే చెడు మార్గంలోని వెళ్తారని మంచి కోసమే మొబైల్ ను వాడాలని తెలిపారు.

అనంతరం రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో లక్ష్మీబాయి మెమోరియల్ ట్రస్ట్   బ్యాంక్ ఖాతాలో చేస్తున్నామని,  మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు  తన తల్లి జ్ఞాపకార్థం  ఫిక్స్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ రూ.60 వేలతో సంవత్సరంలో విద్యార్థులకు బహుమతిగా అంది స్తామన్నారు. 

మొదటి ర్యాంక్ రూ.30వేలు , 2 వ  బహుమతికి రూ.20వేలు, 3వ ర్యాంక్ రూ.10 వేలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్ గణేష్,వార్డు సభ్యులు,ఉపాధ్యాయులు, విద్యార్తులు పాల్గొన్నారు.