విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, మంచి మార్గంలో పయనించాలని పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా డిజిటల్ బోర్డ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారిని డి. కల్పన, మున్సిపల్ వైస్ చైర్మన్, పదో వార్డ్ కౌన్సిలర్ అంతటి పుష్పలత, ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి పాల్గొనికళాశాల 2026-27 అడ్మిషన్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించి,కళాశాలలో క్లాస్ రూమ్ లో ఆధునిక సాంకేతికత గల ఇంటరాక్టివ్ ఫ్లాట్ & డిస్ప్లే ప్యానెల్స్ -ఐఎఫ్ పి, ఐడిపి లను ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






