1 July, 2026 | 6:56 PM

Breaking News

అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •  

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

03-11-2025 06:14 PM

ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి యాకుబ్ 

మందమర్రి (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల ద్వారా దేహదారుడ్యం పెంపొందడంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి ఎండి యాకుబ్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జోనల్ స్థాయి అండర్ 17 కరాటే జట్టు ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లా డారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలో క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని తద్వారా రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా రాణిస్తారని అన్నారు.

ఈ పోటీలకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జోనల్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులు త్వరలో పెద్దపల్లి జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి జట్టు ఎంపిక పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పెద్దన్న, పిడి చిన్నక్క, పోటీల నిర్వాహకులు రంగు శ్రీనివాస్, సీనియర్ కరాటే మాస్టర్లు హరికృష్ణ, వెంకటేష్, నరేష్, సాహిత్, వంశి, క్రీడాకారులు పాల్గొన్నారు.