18-02-2026 01:13:19 AM
కుమ్రం భీం అసిఫాబాద్, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి): జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా 100 రోజుల ప్రత్యేక ప్రచా ర కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ కే. హరిత ప్రారంభించారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, సూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. బాల్య వివాహం నేరమని, ప్రతి ఒక్కరూ నిరోధానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.