23 May, 2026 | 2:47 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

సోయా టోకెన్ల జారీలో తొక్కిసలాట

02-11-2025 12:16 AM

తోపులాడుకోవడంతో కిందపడ్డ రైతులు

  1. ఇద్దరు మహిళా రైతులకు విరిగిన కాళ్లు 
  2. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఘటన

కుభీర్, నవంబర్ 1: సోయ పంటను అమ్ముకోవడానికి టోకెన్ల కోసం రైతులు ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి ఇద్దరు మహిళా రైతుల కాళ్లు విరిగాయి. పదిమంది రైతులకు గాయాలయ్యా యి. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో శనివారం జరిగింది. పీఏసీఎస్ కార్యాలయంలో సోయ పంట కొనుగోళ్లను ప్రభు త్వం ప్రారంభించింది. టోకెన్ల కోసం వచ్చిన వందలాది మంది రైతులు నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. మహిళా రైతులు లక్ష్మీబాయి, చంద్రకళ ఇద్దరికీ కాళ్లు విరుగగా మరో 10 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన పీఏసీఎస్ అధికారులు టోకెన్లజారీని నిలి పేశారు. పోలీసులు  రద్దీని నియంత్రించి, కూపన్లను జారీ చేశారు.