6 May, 2026 | 8:06 PM

Breaking News

చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •  

సంగారెడ్డిలో శ్రీలంక ప్రతినిధుల బృందం పర్యటన

24-01-2026 12:54 AM

సంగారెడ్డి, జనవరి 23: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక పరిపాలన విధానాలపై అధ్యయనం చేసేందుకు శ్రీలంకలోని సిలోన్ వర్కర్ కాంగ్రెస్కు చెందిన సభ్యులు సంగా రెడ్డి జిల్లా కలెక్టరేట్ను సందర్శించారు. భారత ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మం త్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న 10 రోజుల అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శ్రీలంక ప్రతినిధుల బృందాన్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో నువారా ఎలియా డిప్యూటీ మేయర్తో పాటు శ్రీలంకకు చెందిన 20 మంది ఎన్నికైన ప్ర జా ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక పరిపాలనలో సంస్థాగత సామర్థ్యాల బలోపేతం, ఉత్తమ పాలన విధానాలపై అవగాహన కల్పించడం, అలాగే భారత్‌శ్రీలంక దేశాల మధ్య పరస్పర అనుభవాల మార్పిడి ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.  అధ్యయన కార్యక్రమంలో భాగంగా అంతకు ముందు శ్రీలంక ప్రతినిధులు సంగారెడ్డి జిల్లాలోని ఫల పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు.

అక్కడ ఆధునిక వ్యవసాయ పరిశోధనలు, సాగు పద్ధతులు, రైతుల ఆదాయం పెంపు కోసం చేపడుతున్న చర్యలపై ఫల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక పరిపాలన వ్యవస్థ ప్రజల జీవితాల్లో నేరుగా మార్పు తీసుకువచ్చే శక్తివంతమైన సాధనమని అన్నారు. మహిళా సాధికారత, వ్యవసాయ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అంశాలను సమన్వయంగా అమలు చేసినప్పుడే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.