12 July, 2026 | 2:44 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

"సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

12-07-2026 01:43 PM

హుజుర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను సమర్థవంతంగా, ఎటువంటి అలసత్వం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని హుజుర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు బిఎల్ వో లకు సూచించారు. నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని రామాపురం 34, 35 పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని తహసీల్దార్ సైదులుతో కలిసి ఆదివారం నాడు పరిశీలించారు.

అధికారులు ఓటర్ల నుంచి వినతులు స్వీకరించి, సందేహాలకు సమాధానాలు అందిస్తూ సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న నమోదు ప్రక్రియ, ప్రజలకు అందుతున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలను పరిశీలించారు.