7 May, 2026 | 3:10 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఓటరు జాబితా సవరణకు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్

20-11-2025 12:09 AM

పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ కసరత్తు 

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) వేగంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాను మరోసారి సవరించేందుకు ఎస్‌ఈసీ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో గురువారం నుంచి నవంబర్ 23 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది.

ఈ నాలుగు రోజుల్లో గ్రామాల్లో ఓటరు జాబితాలను ఇంటింటి స్థాయిలో పరిశీలించి, కొత్తగా అర్హత సాధించిన వారి పేర్లు చేర్చ డం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఇతర సవరణలు చేపట్టనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో బూత్ లెవల్ ఆఫీసర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, స్థానిక సర్పంచ్‌ల సహకారంతో ఈ ప్రక్రియ జరగనుం ది. కాగా, ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి, అవసరమైన సవరణలు చేయిం చుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఎస్‌ఈసీ సూచించింది.