7 April, 2026 | 11:38 AM

Breaking News

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •  

సోనియాగాంధీకి అస్వస్థత

07-01-2026 12:00 AM
  1. ఆసుపత్రిలో చేరిక 
  2. వాయుకాలుష్య ప్రభావమేనని తేల్చిన వైద్యులు

న్యూఢిల్లీ, జనవరి 6: దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతోపాటు వాయు కాలుష్యం కారణంగా ఏఐసీసీ అగ్ర నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది ఆమెను హుటాహుటిన సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు ఆమెకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి చలికితోడు వాయుకాలుష్య తీవ్రత పెరగడంతోనే ఆమె అస్వస్థత పాలయ్యారని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ ప్రకటించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని స్పష్టం చేశారు.