18 June, 2026 | 9:26 PM

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఎస్ఐ సస్పెన్షన్

18-06-2026 02:41 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్18:  మండల కేంద్రం అర్వపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఈట సైదులును గురువారం జిల్లా ఎస్పీ నరసింహ సస్పెండ్ చేశారు.విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా,ఫోక్సో కేసు వ్యవహారంలో అనుచిత ప్రమేయంపై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా పరిగణించి ఈచర్య తీసుకుంటున్నట్లు విశ్వాసనీయ వర్గాలు వెల్లడించాయి.పలు కేసుల్లో ఆధారాలను తారుమారు చేసి అవినీతి,అక్రమాలను నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.