5 May, 2026 | 1:47 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

బీసీలను ఈ దేశంలో బతకనివ్వరా?

10-10-2025 01:55 AM

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును అడ్డుకునే విధంగా కొందరు వ్యవహారించడం దుర్మార్గమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు మండిపడ్డారు. బీసీలకు సంబంధించి పల్లెంలో అన్నంలో లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం హైకోర్టు ఆవరణలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మేము అడ్డుకోలేదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎవరి జనాభా ఎంతో.. వారికి అంతా వాటా దక్కాలని రాహుల్‌గాంధీ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అడ్డుకుని బీసీలను అన్ని విధాలుగా అణగదొక్కున్నాయి. ఈ దేశంలో బీసీలను బతకనివ్వరా? మేం రాజకీయంగా, ఆర్థికంగా పైకి రావడం ఇష్టం లేదా? జ్యూడిషియల్‌లోనూ రిజర్వేషన్లు అమలు కావాలి. అప్పుడు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.

 పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు