13 May, 2026 | 12:49 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

శివ.. శివా.. ఏందిది!

23-08-2025 01:35 AM
  1. అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్ గీతం పాడిన డీకే శివకుమార్
  2. బీజేపీకి దగ్గరవుతున్నాడని చర్చ

బెంగళూరు, ఆగస్టు 22: ఇప్పటికే వరుస పరాజయాలతో అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం కుర్చీ విషయంలో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల నడుమ కోల్డ్‌వార్ జరుగుతుందనే ప్రచారం నడుస్తున్న.

నేపథ్యంలో ఇప్పుడు కన్నడ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో చేసిన చర్యలు వైరల్ అవుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన గీతాన్ని డీకే శివకుమార్ అసెంబ్లీలో పాడి వినిపించారు. 

ఏం జరిగిందంటే..

కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ అసెంబ్లీలో ప్రసంగించారు. తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్ గీతం ‘నమస్తే సదా వత్సలే’ను కూడా ఆలపించారు. దీంతో అందరికీ అనుమానాలు షురువయ్యాయి.

ఇప్పటికే డీకేకు సీఎం సిద్ధరామయ్యకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉందని ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ వివాదంపై డీకే శివకుమార్ స్పందించారు. ‘కట్టే కాలే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా’ అని తెలిపారు.