2 May, 2026 | 8:47 PM

Breaking News

సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •   అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన నిషికా పాత్రుడు   •  

మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం

02-05-2026 07:12 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పి డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ షీ టీం ఆధ్వర్యంలో కేసముద్రం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో  ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా మహిళల భద్రత గురించి ఉప్పరపల్లి, బిచ్చ నాయక్ తండా, సప్పిడి గుట్ట తండాలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆయా గ్రామాల పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న మహిళా కూలీల భద్రతను దృష్టిలో ఉంచుకుని షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ప్రత్యేకంగా పని ప్రదేశంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్సై సునంద మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రత, అలాగే పని ప్రదేశాలలో జరిగే దోపిడీ, వేధింపులు, మోసపూరిత చర్యల గురించి వివరించారు. వ్యక్తిగత భద్రతా చర్యలు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, పోలీస్ సహాయం పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. అలాగే మహిళలు తమ హక్కులను తెలుసుకొని, ఎటువంటి వేధింపులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మహిళలకు డయల్ 100/112, మహబూబాబాద్ షీ టీం నెంబర్: 8712656935, ఇతర అత్యవసర సేవలు సైబర్ టోల్ ఫ్రీ నెంబర్1930 గురించి వివరాలు తెలియజేశారు. గ్రామ స్థాయిలో సమిష్టి సహకారంతో భద్రతా వాతావరణాన్ని సృష్టించుకోవాలని, మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ పనుల నిర్వహకులు, షీ టీం ఏఎస్ఐ సుధాకర్, అరుణ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.