13 May, 2026 | 5:09 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

ముగిసిన నామినేషన్ల పరిశీలన..

03-12-2025 11:21 PM

17 జీపీలకు 88 

156 వార్డుకు 389 నామినేషన్లు 

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండో విడతగా వేసిన నామినేషన్ల ప్రక్రియ పరిశీలన ప్రక్రియ బుధవారం ముగిసింది. బెల్లంపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 88 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. స్క్రూటినీలో 17 గ్రామ పంచాయతీలకు పడిన 88, నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. 156 వార్డులకు గాను వేసిన 389 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

నామినేషన్ల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విజిట్ చేశారు. 4వ తేదీన అప్పిల్లకు గడువు, 5న అప్పిల్ ల పరిష్కారం, 6 నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఘట్టం ముగిసిన వెంటనే ఎన్నికల పోరులో తలపడతారు. 14న ఎన్నికలు అదే రోజు ఓట్ల లెక్కింపు వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.