8 June, 2026 | 6:10 PM

Breaking News

10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •   కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం   •  

గ్రామాల మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా నిధుల మంజూరు: ఎమ్మెల్యే

08-06-2026 04:39 PM

బోథ్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి దశలవారీగా నిధులు మంజూరు చేయించి అన్ని గ్రామాల ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. సోమవారం బూతు మండలంలోని ఉచిర్యాల గ్రామానికి రెండు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు  నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆర్ అండ్ బి రోడ్డు నుండి నాగపూర్ మీదుగా మంద బొగుడ వరకు నిర్మించనున్న ఈ రోడ్డును సకాలంలో పూర్తి అయినట్లు ఆయన పేర్కొన్నారు.

దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చేయించడం జరిగిందన్నారు. అంతకుముందు నేరడిగొండ మండలంలోని బుద్ధికొండ నుండి తేజపూర్ వరకు నిర్మించాను అన్న డ్యూటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. రెండు కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రోడ్డు వల్ల ఆయా గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు ఈ రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి దశలవారీగా అన్యులను తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు.